మంత్రాలయంలో గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2020-07-05T22:19:26+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి.

మంత్రాలయంలో గురుపౌర్ణమి వేడుకలు

కర్నూల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో గురు పౌర్ణమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజామున వేద పండితులు శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య తుంగభద్ర నది తీరానా ఉన్న తులసి వనంలో మృతిక సంగ్రహణోత్సవం జరిపించారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. కేవలం శ్రీమఠం అధికారులు, వేద పండితులు మాత్రమే పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T22:19:26+05:30 IST