మనోళ్లే ఆంధ్రాలో భూములు కొంటున్నారు

ABN , First Publish Date - 2022-05-15T08:45:02+05:30 IST

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మనోళ్లే ఆంధ్రాలో భూములు కొంటున్నారు

తెలంగాణ వచ్చాక సీన్‌ రివర్స్‌ అయ్యింది: హరీశ్‌రావు 

సిద్దిపేట అర్బన్‌, మే 14: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి మంత్రి హరీశ్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఆంధ్రావాళ్లు తెలంగాణలో భూములు కొనేవారని కానీ ప్రత్యేక రాష్ట్రం అయ్యాక ఈ సీన్‌ రివర్స్‌ అయ్యిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ వాళ్లే ఆంధ్రాలో భూములు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో తాను స్వయంగా నిర్వహిస్తున్న ఉచిత టెట్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు హరీశ్‌ శనివారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలంగాణలో భూముల ధరలు తక్కువగా ఉండేవని గుర్తు చేశారు. కానీ, రాష్ట్రంతో పోలిస్తే ప్రస్తుతం ఆంధ్రాలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తుండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పారు.  

Updated Date - 2022-05-15T08:45:02+05:30 IST