మండపేట టౌన్ సీఐ దుర్గాప్రసాద్ సస్పెన్సన్
ABN , First Publish Date - 2022-03-09T22:07:48+05:30 IST
మండపేటలో ప్రగడ శ్రీకృష్ణభగవాన్ (22) ఆత్మహత్యకు కారణమైన మండపేట టౌన్ సీఐ దుర్గాప్రసాద్పై సస్పెన్సన్ వేటు వేశారు.
రాజమండ్రి: మండపేటలో ప్రగడ శ్రీకృష్ణభగవాన్ (22) ఆత్మహత్యకు కారణమైన మండపేట టౌన్ సీఐ దుర్గాప్రసాద్పై సస్పెన్సన్ వేటు వేశారు. సీఐ దుర్గాప్రసాద్ను సస్పెన్సన్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ దుర్గాప్రసాద్, కానిస్టేబుల్ సతీష్, వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు భద్రత మధ్య శ్రీకృష్ణభగవాన్ మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు బాధిత కుటుంబసభ్యులకు సంఘీబావం తెలిపారు.
మండపేటకు చెందిన ప్రగడ కాళీకృష్ణభగవాన్ గాంధీనగర్లో తల్లితండ్రులతో ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమించడంతో బాలిక తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ నిమిత్తం ఆ యువకుడిని ఆదివారం కానిస్టేబుల్ సతీష్తో పిలిపించుకుని రెండ్రోజులపాటు సీఐ ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో తీవ్రగాయాలపాలైన.. కృష్ణ దెబ్బలు తాళలేక జరిగిన ఘటనను తల్లితండ్రులతో చెప్పాడు. అనంతరం కృష్ణ మంగళవారం ఏడిదరోడ్డులోవున్న పెట్రోలు బంక్ సమీపాన ఉన్న పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.