కేబినెట్‌లో వర్గీకరణ అంశాన్ని కిషన్‌రెడ్డి ప్రస్తావించాలి: మందకృష్ణ

ABN , First Publish Date - 2021-12-21T00:18:22+05:30 IST

కేబినెట్‌లో వర్గీకరణ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రస్తావించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

కేబినెట్‌లో వర్గీకరణ అంశాన్ని కిషన్‌రెడ్డి ప్రస్తావించాలి: మందకృష్ణ

హైదరాబాద్: కేబినెట్‌లో వర్గీకరణ అంశాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రస్తావించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాన్ని ప్రశ్నించకుడా తమను ఎందుకు అడుగుతున్నారని రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ మోసం చేసింది కానీ ఏడున్నరేళ్ల బీజేపీ పాలనలో ఒక్క అడుగు ముందుకు పడలేదని చెప్పారు. కిషన్‌రెడ్డి పైనే బరువు, బాధ్యత ఉంది, దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో అన్ని పరిష్కరించుకుంటున్నారు అన్ని బిల్లులు అమోదించుకుంటున్నారని కాని వర్గీకరణ అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని మందకృష్ణ మాదిగ  కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-21T00:18:22+05:30 IST