మంచిర్యాల జిల్లాలో 54కి చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-13T14:46:21+05:30 IST

మంచిర్యాల జిల్లా : జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి.

మంచిర్యాల జిల్లాలో 54కి చేరిన కరోనా కేసులు

మంచిర్యాల జిల్లా : జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య  54కి చేరింది. మంచిర్యాల, నస్పూర్, బెల్లం పల్లి ఏరియాల్లోనే అధికంగా కేసులు ఉన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల అప్రమత్తమయ్యారు. సాయంత్రం 5గంటల తర్వాత ఈ ప్రాంతాల్లో వ్యాపార సంస్థల మూసివేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో నో ఎంట్రీ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆఫీసుకు రానక్కర్లేదని ఆన్ లైన్‌లో దరఖాస్తు చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల చెబుతున్నారు.

Updated Date - 2020-07-13T14:46:21+05:30 IST