గ్రీన్ చాలెంజ్లో పాల్గొన్న మానసి జోషి
ABN , First Publish Date - 2020-08-03T08:58:26+05:30 IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మానసి జోషి...
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మానసి జోషి పాల్గొంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఆమె ఆదివారం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా మానసి మాట్లాడుతూ.. ‘మనిషి స్వార్థానికి ప్రకృతి చిన్నాభిన్నం అవుతోంది. దీంతో అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. మొక్కలు నాటి భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత’ అని పిలుపునిచ్చింది. సంతోష్ కుమార్ ఆలోచన ఉదాత్తమైనదని, దీన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించింది. ప్రముఖ షూటర్ అంజుమ్ మౌద్గిల్, రచయిత హర్నిద్ కౌర్, ఫ్యాషన్ స్టైలిస్ట్, బ్లాగర్ పాయల్ షా పటేల్ను మానసి నామినేట్ చేశారు.