ఐసోలేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి అరెస్ట్
ABN , First Publish Date - 2020-03-29T09:31:34+05:30 IST
గుంటూరు జీజీహెచ్లో కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు నుంచి పరారైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరిపేటకు చెందిన ఓ వ్యక్తి గుంటూరులో...
గుంటూరు, మార్చి 28: గుంటూరు జీజీహెచ్లో కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు నుంచి పరారైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిలకలూరిపేటకు చెందిన ఓ వ్యక్తి గుంటూరులో ఉంటూ వంటపనులకు వెళ్తున్నాడు. బాగా దగ్గు వస్తుండటంతో 25న జీజీహెచ్కు వెళ్లాడు. అనుమానించిన వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించారు. క్యాజువాలిటీలో చిలకలూరిపేట బదులు పెనమలూరుగా రాశారు. ఓపీ స్లిప్లో తప్పులు సరిచేసుకొని వస్తానని వెళ్లిన వ్యక్తి అటునుంచి అటే వెళ్లిపోయాడు. ఆర్ఎం ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్గా తేల్చి డిశ్చార్జ్ చేశారు.