పెంపుడు కుక్కను చావబాదిన వ్యక్తికి అరదండాలు

ABN , First Publish Date - 2021-10-10T02:24:08+05:30 IST

తన పెంపుడు శునకాన్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదిన వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

పెంపుడు కుక్కను చావబాదిన వ్యక్తికి అరదండాలు

చెన్నై: తన పెంపుడు శునకాన్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదిన వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా వీడియో తీసిన ఇరుగుపొరుగువారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. మరిముత్తు అనే దినసరి కూలీ ఈ దారుణానికి పాల్పడ్డాడు.


సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన హ్యుమానే యానిమల్ సొసైటీకి చెందిన వాసుదేవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరిముత్తును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సబ్‌ జైలుకు పంపించారు. తీవ్రంగా గాయపడిన శునకానికి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-10-10T02:24:08+05:30 IST