TS News: మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం మద్దతు కోరిన మల్లు రవి
ABN , First Publish Date - 2022-08-18T22:11:46+05:30 IST
TS News: మునుగోడు ఉప ఎన్నిక (Munugodu Bypoll)నేపథ్యంలో రాజకీయ పార్టీలు మద్దతు కూడగట్టుకుంటున్నాయి. తమతో జత కట్టాలని సీపీఎం(CPI) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammmiveni Veerabhadrum)ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు
TS News: మునుగోడు ఉప ఎన్నిక (Munugodu Bypoll)నేపథ్యంలో రాజకీయ పార్టీలు మద్దతు కూడగట్టుకుంటున్నాయి. తమతో జత కట్టాలని సీపీఎం(CPI) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammmiveni Veerabhadrum)ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కలిసి కోరారు. రాజ్యాంగేతర శక్తిగా పాలన చేస్తున్న టీఎర్ఎస్కు వ్యతిరేకంగా తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరగా...మల్లు రవి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పారని మల్లురవి తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి (Marri Shasidhar Reddy) కామెంట్స్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని, మానిక్కం టాగూర్, రేవంత్ రెడ్డి పై ఆయన మాటలతో నేను ఏకీబవించనని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక కాంగ్రెస్లో కదలిక వచ్చిందన్నారు.