రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు.. దివాళా తీసిన కాంగ్రెస్‌కు ఆయనో ప్రెసిడెంట్: మల్లారెడ్డి

ABN , First Publish Date - 2021-10-23T19:31:34+05:30 IST

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు.

రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు.. దివాళా తీసిన కాంగ్రెస్‌కు ఆయనో ప్రెసిడెంట్: మల్లారెడ్డి

హైదరాబాద్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. పాలలో తోడుపెట్టి పథకాల్లో వాటా ఉందని బీజేపీ చెప్పుకుంటోందని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణకు బీజేపీ ఎంపీలు ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. రేవంత్‌కు సబ్జెక్టు లేదని.. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. ఆయన ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఓ లీడరా? అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ను ప్రజలు నమ్మరని.. దివాళా తీసిన కాంగ్రెస్‌కు రేవంత్ ఒక ప్రెసిడెంట్ అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్‌ను నమ్మరని మల్లారెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-10-23T19:31:34+05:30 IST