రైతు మల్లారెడ్డి గురించి మాట్లాడుతూ.. రఘునందన్ భావోద్వేగం

ABN , First Publish Date - 2021-06-19T01:27:05+05:30 IST

మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఆదుకోవల్సిందేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన..

రైతు మల్లారెడ్డి గురించి మాట్లాడుతూ.. రఘునందన్ భావోద్వేగం

హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు బాధితులను ఆదుకోవల్సిందేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన.. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. 70 ఏళ్ల రైతు మల్లారెడ్డి... ముగ్గురు ఆడపిల్లల తండ్రి.. తన చితిని తాను పేర్చుకుని సజీవ దహనమైన ఘటన... ఉదయం నుంచి కలచి వేసిందంటూ ఉద్వేగానికి గురయ్యారు.  స్థానిక ఎమ్మెల్యే అయిన తనను రైతులను కలవకుండా చేశారని వాపోయారు. చుట్టూ ఉన్న పోలీసులను చూసి మల్లారెడ్డి మనవడు ప్రభుత్వంపై విమర్శలు చేసే ధైర్యం చేయలేకపోయి ఉంటాడన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, ఆ మేనేజ్ చేసే డబ్బులతో రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్.. అక్కడే ముంపు బాధితులపై తొలి సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా తుక్కాపూర్ రైతుల సాదకబాధలను తెలియజేశారు. 

Updated Date - 2021-06-19T01:27:05+05:30 IST