30 నిమిషాల్లో లక్ష బుకింగ్‌లు మహీంద్రా స్కార్పియో-ఎన్‌ రికార్డు

ABN , First Publish Date - 2022-07-31T07:12:01+05:30 IST

దేశీయ వాహన తయారీదారు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కొత్త ఎస్‌యూవీ మోడల్‌ స్కార్పియో-ఎన్‌కు కస్టమర్ల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.

30 నిమిషాల్లో లక్ష బుకింగ్‌లు మహీంద్రా స్కార్పియో-ఎన్‌ రికార్డు

ముంబై: దేశీయ వాహన తయారీదారు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కొత్త ఎస్‌యూవీ మోడల్‌ స్కార్పియో-ఎన్‌కు కస్టమర్ల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. ఈ కారు బుకింగ్‌ శనివారం ప్రారంభం కాగా.. తొలిరోజే లక్షకు పైగా ఆర్డర్లు లభించాయని ఎం అండ్‌ ఎం వెల్లడించింది. బుకింగ్‌ ప్రారంభించిన తొలి నిమిషంలోనే 25,000 ఆర్డర్లు లభించాయని, మొదటి 30 నిమిషాల్లోనే బుకింగ్స్‌ లక్ష మైలురాయిని దాటాయని కంపెనీ తెలిపింది.   కొనుగోలుదారులకు స్కార్పియో-ఎన్‌ డెలివరీ సెప్టెంబరు 26 నుంచి ప్రారంభం కానుంది. 

Updated Date - 2022-07-31T07:12:01+05:30 IST