మార్కెట్లో మహీంద్రా ‘యువో టెక్ ప్లస్’
ABN , First Publish Date - 2022-06-09T08:46:53+05:30 IST
మహీంద్రా గ్రూప్నకు చెందిన మహీంద్రా ట్రాక్టర్స్ ‘యువో టెక్ ప్లస్’ శ్రేణిలో ఆరు కొత్త ట్రాక్టర్లను తెలంగాణ విపణిలోకి విడుదల చేసింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మహీంద్రా గ్రూప్నకు చెందిన మహీంద్రా ట్రాక్టర్స్ ‘యువో టెక్ ప్లస్’ శ్రేణిలో ఆరు కొత్త ట్రాక్టర్లను తెలంగాణ విపణిలోకి విడుదల చేసింది. 37-50 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ల శ్రేణిలో వీటిని ప్రవేశపెట్టినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్వి్పమెంట్ విభాగం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు.