బయ్యారం పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2022-03-12T14:28:32+05:30 IST

బయ్యారం పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తిని చితకబాదడంతో బాధితుడు నడవలేని స్థితికి చేరుకున్నాడు.

బయ్యారం పోలీసుల అత్యుత్సాహం

మహబూబాబాద్: బయ్యారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తిని చితకబాదడంతో బాధితుడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో బానోతు మురళి అనే వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. కేసు విషయమై బయ్యారం ఎస్ఐ రమాదేవి స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో ఎస్ఐ సహా మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా కొట్టడంతో మురళీ నడవలేని స్థితికి చేరాడు. వెంటనే అతడిని బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

Updated Date - 2022-03-12T14:28:32+05:30 IST