దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసింది బాబాయేనా?
ABN , First Publish Date - 2020-10-20T14:55:12+05:30 IST
: కిడ్నాప్కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి ఆచూకీ ఇంకా లభించలేదు. గత 36 గంటలుగా బాలుడు కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు.
మహబూబాబాద్: కిడ్నాప్కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి ఆచూకీ ఇంకా లభించలేదు. గత 36 గంటలుగా బాలుడు కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం నుంచి కిడ్నాపర్లు ఎలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ చేయకపోవడంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో బాలుడి బాబాయ్ మనోజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఫోన్ కాల్స్ నిలిచిపోయాయి. దీంతో మనోజ్పైనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. బాబు తండ్రి రంజిత్ రెడ్డి... తన బాబాయి కొడుకు మనోజ్ను నెలన్నరగా జీతం ఇచ్చి తన వద్ద చిటీల డబ్బుల వసూలు కోసం పెట్టుకున్నాడు. బాబు కిడ్నాప్కు గురైన రోజు మనోజ్ ఫ్రెండ్ బైక్పై వెళ్లాడని దీక్షిత్ స్నేహితుడు చెబుతున్నాడు. దీంతో దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు సవాల్గా మారింది. టెక్నాలజీ వాడకంలో పోలీసులకంటే కిడ్నాపర్లు అడ్వాన్స్గా ఉన్నట్లు తెలుస్తోంది.