మాడపాటి సత్యవతి ఇక లేరు
ABN , First Publish Date - 2020-03-05T08:36:40+05:30 IST
ఆల్ ఇండియా రేడియోలో మూడున్నర దశాబ్దాలు న్యూస్ రీడర్, న్యూస్ ఎడిటర్గా పనిచేసిన మాడపాటి సత్యవతి(89) ఇక లేరు. ఆమె
న్యూస్ రీడర్గా ఆకాశవాణిలో మూడున్నర దశాబ్దాలు విధులు
సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్/పద్మారావునగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా రేడియోలో మూడున్నర దశాబ్దాలు న్యూస్ రీడర్, న్యూస్ ఎడిటర్గా పనిచేసిన మాడపాటి సత్యవతి(89) ఇక లేరు. ఆమె బుధవారం పద్మరావునగర్లోని తన నివాసంలో కన్ను మూశారు. హైదరాబాద్ నగర విమోచన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మాడపాటి రామచందర్రావు కుమార్తె అయిన సత్యవతి ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు మనుమరాలు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఏ తెలుగులో పట్టా సాధించారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ, హైదరాబాద్లో పలు విభాగాల్లో సేవలందించారు. తిరుమలగిరిలోని స్వర్గధాం హిందూ స్మశానవాటికలో సత్యవతి అంత్యక్రియలు నిర్వహించారు. సత్యవతి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.