బీజేపీ ఎంపీ కుమారునిపై కాల్పులు

ABN , First Publish Date - 2021-03-03T13:40:35+05:30 IST

బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కుమారుడు ఆయుష్ కిశోర్‌పై కొందరు.....

బీజేపీ ఎంపీ కుమారునిపై కాల్పులు

లక్నో: బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కుమారుడు ఆయుష్ కిశోర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. మంగళవారం అర్థరాత్రి దాటాక వారు ఆయుష్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే ఎంపీ కౌశల్‌తో పాటు పలువురు అధికారులు ఆయుష్ చికిత్స పొందుతున్న ట్రామా సెంటర్‌కు చేరుకున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటాకా ఆయుష్ కారులో వెళుతుండగా ఆరుగురు ఆగంతకులు అతని కారును అడ్డుకుని కాల్పులు జరిపారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 



Updated Date - 2021-03-03T13:40:35+05:30 IST