దారుణం: దారితప్పిపోయిన యువతిని ఇంటికి తీసుకెళ్లి.. భర్తను పిలిచి.. ఓ 40ఏళ్ల మహళ ఏం చేసిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-01T17:27:49+05:30 IST

వరదలు రావడంతో..

దారుణం: దారితప్పిపోయిన యువతిని ఇంటికి తీసుకెళ్లి.. భర్తను పిలిచి.. ఓ 40ఏళ్ల మహళ ఏం చేసిందో తెలిస్తే..!

లక్నో(ఉత్తర ప్రదేశ్): వరదలు రావడంతో ఓ యువతి కుటుంబం వారున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లారు. ఓ రోజు బయటకు వెళ్లిన ఆమె.. తమ ఇంటి అడ్రస్ మర్చిపోయింది. మార్గమధ్యంలో ఓ మహిళ పరిచయమయ్యి వారింటికి తీసుకెళ్లింది. భర్తతో కలిసి ఆ యువతికి ఓ పెద్ద షాకే ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే..


ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో ప్రాంతంలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్నా(45ఏళ్లు), ఆర్తి(40ఏళ్లు) అనే దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రహింనగర్ ప్రాంతంలోని ఓ బస్తీలో ఉన్న ఇళ్లన్నీ మునిగిపోయాయి. దీంతో వారందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అదే ప్రాంతానికి చెందిన ఓ 19ఏళ్ల యువతి కుటుంబం ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్ 21న ఆ యువతి బయటికి వెళ్లి ఇంటి అడ్రస్ మర్చిపోయింది. కంగారు కంగారుగా ఇంటికోసం వెతుకుతున్న ఆ యువతి.. ఆర్తి కంటపడింది. ఆమె మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికెళ్లాకా ఆ యువతికి ఆమె షాకిచ్చింది. 



తన భర్తతో శృంగారం చేయాలని కోరింది. అందుకు ఆ యువతి కాదనడంతో.. ఆర్తి ఆ యువతిని కొట్టి, మంచానికి కట్టేసింది. ఆర్తి ఎదుటే, మున్నా ఆ యువతిపై అత్యాచారం చేశాడు. జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆ యువతి నాలుకను కోసేశారు. ఆ తర్వాత వారం రోజులపాటు శృంగారం చేస్తూనే ఉన్నాడు. సెప్టెంబర్ 29న ఆ దంపతులు బయటికి వెళ్లినప్పుడు ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకుంది.


కూతురు కనపడనిరోజే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. తప్పిపోయిన కూతురు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు సంతోషించారు. కానీ గలగల మాట్లాడే తన కూతురు, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఖంగుతిన్నారు. ఏమైందని అడగ్గా.. ఆమె సైగలతో జరిగిన విషయమంతా చెప్పింది. వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఆర్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మున్నా పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2021-10-01T17:27:49+05:30 IST