ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి..
ABN , First Publish Date - 2021-04-24T18:13:43+05:30 IST
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి
హైదరాబాద్/ఏఎస్రావునగర్ : ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసగించిన యువకుడిని శుక్రవారం కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఓ యువతి(33), యాప్రాల్కు చెందిన జబ్బా కార్తీక్(27) ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు సహజీనం చేశారు. గతేడాది సదరు యువతి పెళ్లి చేసుకోవాలని కోరింది. నిరాకరించడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం జైలుకు వెళ్లివచ్చిన కార్తీక్ మళ్లీ ఆ యువతి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం కొనసాగించాడు.
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన లోక్అదాలత్లో కేసు రాజీకుదుర్చుకుని కొట్టివేసేలా ప్లాన్ చేసుకున్నాడు. తిరిగి ఇటీవల మళ్లీ ఆ యువతి పెళ్లి ప్రస్తావన తేవడంతో కార్తీక్ ముఖం చాటేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. కార్తీక్ను నమ్మి రెండుసార్లు మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈనెల 21న కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్తీక్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.