మాగంటి బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్

ABN , First Publish Date - 2021-03-09T02:06:34+05:30 IST

ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి టీడీపీ నేత నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మాగంటి బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్

ఏలూరు: ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి టీడీపీ నేత నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబసభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పెద్ద కుమారుడు రాంజీ(36) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల మూడో తేదీన అస్వస్థతకు గురైన ఆయన ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా అదేరోజు పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతిచెందారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా మూడేళ్లుగా పనిచేశారు. చిన్న వయస్సులోనే జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.

Updated Date - 2021-03-09T02:06:34+05:30 IST