పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-08-31T21:11:55+05:30 IST

పోలవరం నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు.

పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి: లోకేశ్‌

అమరావతి: పోలవరం నిర్వాసితులను వైసీపీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు. మంగళవారం పోలవరం ముంపు మండలాల్లో లోకేశ్‌ పర్యటించారు. ఈసందర్భంగా రాజమండ్రి కూనవరం టేకులబోరులో పోలవరం నిర్వాసిత మహిళలు లోకేశ్‌ని కలిసి సమస్యలను విన్నవించారు. వరద సాయంగా రెండు బంగాళాదుంపలు, ఒక కొవ్వొత్తి మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని నిర్వాసితులు చెప్పారు. వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వకపోవడంతో వరదల్లో బురద నీరు తాగి బతికామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీసం బియ్యం కూడా ఇవ్వలేదన్నారు. మంత్రులు కూడా ఇక్కడకు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. తమకు పునరావాస ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం చేస్తారన్న నమ్మకం లేదన్నారు.  టీటీడీ అండగా ఉంటుందని లోకేష్ పోలవరం నిర్వాసితులకు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-08-31T21:11:55+05:30 IST