వైసీపీ నేతలకు రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2022-05-20T08:50:38+05:30 IST

వైసీపీ నేతలకు రోజులు దగ్గరపడ్డాయి

వైసీపీ నేతలకు రోజులు దగ్గరపడ్డాయి

రోడ్ల దుస్థితికి చినజీయర్‌ వ్యాఖ్యలే నిదర్శనం: లోకేశ్‌


అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు. ప్రశ్నించిన రైతుని... రైతుని ఆపలేదని పోలీస్‌ అధికారిని... కవరేజ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధిని నోటికొచ్చినట్లు మాట్లాడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీరు దారుణం’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘‘విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా ‘పంతులూ నీ సంగతి చూస్తా’ అంటూ పాత్రికేయుడు గణేశ్‌ను బె దిరించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం. ఫ్రస్టేషన్‌లో మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించడం, రైతును బూతులు తిట్టడం, ఎస్సైని ఒరేయ్‌ అంటూ చిందులు తొక్కడం చూస్తుంటే... వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడినట్లే అనిపిస్తోంది’’ అని అన్నారు. అవంతి శ్రీనివాస్‌ తిట్టిన తిట్ల వ్యవహారానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. మరోవైపు... ‘‘రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి చినజీయర్‌ వ్యాఖ్యలే నిదర్శనం. అధ్వాన్న పాలనకి ఉదాహరణగా పక్కరాష్ట్ర పాలకులు మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందన శూన్యం’’ అని లోకేశ్‌ విమర్శించారు. 

Updated Date - 2022-05-20T08:50:38+05:30 IST