తిక్కారెడ్డికి భద్రత కల్పించాలి: లోకేశ్

ABN , First Publish Date - 2021-12-12T03:16:23+05:30 IST

ప్రజాస్వామ్యాన్ని జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ కత్తికి బలిస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్షనేతల్ని హతమార్చడానికా?...

తిక్కారెడ్డికి భద్రత కల్పించాలి: లోకేశ్

అమరావతి: ప్రజాస్వామ్యాన్ని జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ కత్తికి బలిస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్షనేతల్ని హతమార్చడానికా? ఆయన ప్రశ్నించారు. తిక్కారెడ్డిపై వైసీపీ మూకల హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రెండుసార్లు ఆయనపై హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని చెప్పారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రాణహాని ఉన్న టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని సూచించారు. కత్తిని నమ్ముకున్న వాడు కత్తికే బలవ్వక తప్పదని,  చరిత్ర చెబుతున్న సత్యాన్ని వైసీపీ గుర్తుపెట్టుకోవాలని లోకేశ్ హెచ్చరించారు. 

Updated Date - 2021-12-12T03:16:23+05:30 IST