మర్కజ్ వెళ్లొచ్చిన వారు సహకరించాలి: ఒవైసీ
ABN , First Publish Date - 2020-04-03T07:25:46+05:30 IST
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందించి ఆదుకోవాలని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందించి ఆదుకోవాలని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ శ్రేణులకు గురువారం పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం అనే వివక్ష లేకుండా నిరుపేదలందరికీ ఆహారాన్ని అందించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పారు. నిజాముద్దీన్ మర్కజ్ బహిరంగ సమావేశానికి హాజరై వచ్చిన వారు వైద్య పరీక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.