లాక్‌డౌన్‌ పొడిగింపు వినాశకరం

ABN , First Publish Date - 2020-05-26T10:26:00+05:30 IST

దేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపులు ఆర్థికంగా వినాశకరమే కాకుండా మరో వైద్యపరమైన ఎమర్జెన్సీకి దారి తీస్తాయని మహీంద్రా

లాక్‌డౌన్‌ పొడిగింపు వినాశకరం

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపులు ఆర్థికంగా వినాశకరమే కాకుండా మరో వైద్యపరమైన ఎమర్జెన్సీకి దారి తీస్తాయని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ‘లాక్‌డౌన్‌ పొడిగింపులతో తీవ్ర మానసిక సమస్యలు, నాన్‌ కొవిడ్‌ రోగుల నిర్లక్ష్యం’ పేరిట వచ్చిన ఒక వ్యాసాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. లాక్‌డౌన్‌ పొడిగింపు ఏ మాత్రం సహాయకారి కాదంటూ ఆ వైపు మొగ్గు చూపడం విధానకర్తలకు అంత తేలిక కాదని కూడా ఆయన అన్నారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతూనే ఉంటాయంటూ మెడికల్‌ బెడ్‌లు, ఆక్సిజన్‌ లైన్ల విస్తరణను కొనసాగించాలని మహీంద్రా సూచించారు. 

ఆనంద్‌ మహీంద్రా

Updated Date - 2020-05-26T10:26:00+05:30 IST