నల్గొండ: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

ABN , First Publish Date - 2021-05-13T16:52:19+05:30 IST

తెలంగాణలో రెండోరోజు లాక్ డౌన్ అమలవుతోంది.

నల్గొండ: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

నల్గొండ: తెలంగాణలో రెండోరోజు లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండడంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. 4 గంటలల్లోనే 7వేల వాహనాలు వెళుతున్నాయి. తమ గమ్యస్థానాలకు చేరేందుకు సొంత వాహనాల్లో వెళుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ ఉండడంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. రోజుకు నాలుగు నుంచి ఐదువేల వాహనాలు మాత్రమే వెళ్లేవి. అలాంటిది ఇప్పుడు కేవలం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో 7 వేలకుపైగా వాహనాలు వెళుతున్నాయి.

Updated Date - 2021-05-13T16:52:19+05:30 IST