Biryaniలో బల్లి
ABN , First Publish Date - 2022-05-27T23:20:30+05:30 IST
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ హోటల్లో బిర్యానీలో బల్లి పడింది. రాంనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి తెచ్చుకున్న బిర్యానీలో బల్లి ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ హోటల్లో బిర్యానీలో బల్లి పడింది. రాంనగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి తెచ్చుకున్న బిర్యానీలో బల్లి ఉన్నట్లు గుర్తించారు. సగం బిర్యానీ తిన్న తర్వాత బల్లిని కార్పొరేటర్ గుర్తించారు. దీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్కు పోలీసులు పంపారు. బిర్యానీ సెంటర్ దగ్గర అధికారులు తనిఖీలు చేస్తున్నారు.