కరోనాపై పోరు.. దీపాలు వెలిగించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2020-04-06T03:19:36+05:30 IST
ప్రధాని మోదీ పిలుపు మేరకు యావత్ భారతం దీపకాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు..
హైదరాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు యావత్ భారతం దీపకాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా ఒక్కటయ్యారు. ఆదివారం రాత్రి 9 గంటలకు కరెంట్ ఆపేసి 9 నిమిషాలపాటు కొవ్వుత్తులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు. కరోనా చీకట్లు తొలిగిపోవాలని కోరుకున్నారు.