కోస్తాలో రేపు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2020-02-24T09:30:44+05:30 IST

రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాంలలో రాబోయే 24 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావమే దీనికి కారణమని

కోస్తాలో రేపు తేలికపాటి వర్షాలు

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాంలలో రాబోయే 24 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావమే దీనికి కారణమని పేర్కొంది. అయితే, బుధవారం రాష్ట్రం మొత్తం పొడి వాతావరణమే ఉంటుందని వివరించింది. కాగా, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. పగటిపూట మాడుపగిలే ఎండ కాస్తున్నది. రాత్రిపూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచుతో చలి ప్రభావం కొనసాగింది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పగటిపూట ఎండతీవ్రత అధికంగా వుంది. 

Updated Date - 2020-02-24T09:30:44+05:30 IST