రమేశ్ ఆస్పత్రిని దోషిని చేయొద్దు
ABN , First Publish Date - 2020-08-12T09:23:48+05:30 IST
విజయవాడ స్వర్ణప్యాలె్సలోని కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమైనదని, అయితే, ఈ
- డీజీపీకి భారత వైద్య సంఘం లేఖ
విజయవాడ ఆగస్టు 11: విజయవాడ స్వర్ణప్యాలె్సలోని కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమైనదని, అయితే, ఈ ఘటనలో రమేశ్ ఆస్పత్రి యాజమాన్యాన్ని, వైద్య సిబ్బందిని దోషులను చేయడం తగదని భారత వైద్య సంఘం(ఐఎంఏ) పేర్కొంది. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎస్వీకే ప్రసాద్రెడ్డి, జనరల్ సెక్రటరీ డాక్టర్ పి.ఫణీందర్ మంగళవారం డీజీపీ గౌతం సవాంగ్కు లేఖ రాశారు. ఈ లేఖను పత్రికలకు విడుదల చేశారు.