సీఎస్కు ఏబీ వెంకటేశ్వరరావు Letter
ABN , First Publish Date - 2022-06-10T02:30:20+05:30 IST
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్పై హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని ఏబీవీ తెలిపారు.
అమరావతి: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తన సస్పెన్షన్పై హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదని ఏబీవీ తెలిపారు. ‘‘సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే.. నా సస్పెన్షన్ రివోక్ చేయాలి. ఇదే విషయాన్ని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. జీవోను సవరించాలన్న విజ్ఞప్తిని ఇప్పటికీ పట్టించుకోలేదు. నాకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి’’ అని లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.