Andhra news: అనంతపురంలో చిరుతపులి కలకలం
ABN , First Publish Date - 2022-07-25T15:03:23+05:30 IST
జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది.
అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆవులపై చిరుతపులి దాడి చేసింది. చిరుత పులి దాడిలో కేశవ అనే రైతుకు చెందిన ఆవు దూడ మృతి చెందాయి. చిరుతపులి దాడి నుంచి తప్పించుకొని మిగిలిన ఆవులు పరుగులు పెట్టాయి. చిరుతపులి సంచారంపై రైతు కేశవ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.