‘ఆసియా వాలీబాల్‌’కు లావణ్య

ABN , First Publish Date - 2022-07-02T10:07:20+05:30 IST

ఆసియా అండర్‌-20 వాలీబాల్‌ చాంపియన్‌షి్‌పలో తలపడే భారత మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి చందు లావణ్య ఎంపికైంది.

‘ఆసియా వాలీబాల్‌’కు లావణ్య

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా అండర్‌-20 వాలీబాల్‌ చాంపియన్‌షి్‌పలో తలపడే భారత మహిళల జట్టుకు తెలంగాణ అమ్మాయి చందు లావణ్య ఎంపికైంది. ఈనెల 4వ తేదీ నుంచి కజకిస్థాన్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థి అయిన లావణ్య అక్కడి వాలీబాల్‌ అకాడమీలోనే ఓనమాలు నేర్చుకుంది. మహబూబాబాద్‌ జిల్లా నర్సిం హులుపేట మండలం జయపురం లావణ్య స్వస్థలం.

Updated Date - 2022-07-02T10:07:20+05:30 IST