జాతీయ అథ్లెటిక్స్ షురూ
ABN , First Publish Date - 2021-09-16T08:24:19+05:30 IST
హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షి్ప బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
హనుమకొండ (స్పోర్ట్స్): హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షి్ప బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ మాజీ చాంపియన్, హైజంపర్ అంజూ బాబీజార్జ్ అతిథిగా పోటీలను వీక్షించింది. తొలిరోజు.. మహిళల 5 వేల మీ.లో ఉత్తరప్రదేశ్కు చెందిన పారుల్ చౌధరి స్వర్ణం సాధించింది. మహారాష్ట్ర అథ్లెట్లు కోమల్ చంద్రకాంత్ జగ్దాలే, సంజీవని బాబర్ జాదవ్ రజత, కాంస్య పతకాలు నెగ్గారు. పురుషుల 5 వేల మీటర్ల పరుగులో అభిషేక్పాల్ (యూపీ) స్వర్ణం, ధర్మేందర్ (రైల్వేస్) రజతం, అజయ్కుమార్ (రైల్వేస్) కాంస్య పతకం గెలుపొందారు. పురుషుల డెకాథ్లాన్లో మొదటి రోజు 100 మీటర్ల పరుగు, లాంగ్జంప్, షాట్ఫుట్, హైజంప్, 400 మీటర్ల పరుగు అంశాలను నిర్వహించారు.