లేట్‌నైట్ పార్టీపై కొనసాగుతోన్న పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-04-04T13:03:09+05:30 IST

లేట్‌నైట్ పార్టీపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫుడింగ్ మింక్ పబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

లేట్‌నైట్ పార్టీపై కొనసాగుతోన్న పోలీసుల విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్: లేట్‌నైట్ పార్టీపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫుడింగ్ మింక్ పబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా బర్త్‌డే పార్టీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ఆధారాలున్నాయి. పోలీసుల తనిఖీలు ఉండవు. 24 గంటల మద్యం.. డ్రగ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పి నిర్వాహకులకు కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. పామ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే పబ్‌లోకి అనుమతి లభిస్తుంది. డ్రగ్స్ కోసం మరో యాప్‌తో పాటు వాట్సప్ గ్రూప్ పెట్టినట్లు గుర్తించారు. పబ్ మేనేజర్ అనిల్‌కుమార్ కనుసన్నల్లో డ్రగ్స్ వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫోన్‌కు వచ్చిన OTPని నిర్ధారించుకున్న తర్వాతే డ్రగ్స్ అందజేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇవాళ మరి కొందరికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. 


Updated Date - 2022-04-04T13:03:09+05:30 IST