కన్నతల్లి కడసారి చూపూ దక్కనివ్వని కరోనా
ABN , First Publish Date - 2020-03-31T09:21:26+05:30 IST
కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో ప్రముఖ ఫ్యాన్సీ వ్యాపారవేత్త దొడ్డా ప్రసాద్ తల్లి తులశమ్మ ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రసాద్కు సోదరి కూడా ఉంది. ఆమె గుంటూరులో భర్తతో నివాసముంటోంది.
కంచికచర్ల రూరల్, మార్చి 30: కృష్ణాజిల్లా కంచికచర్ల పట్టణంలో ప్రముఖ ఫ్యాన్సీ వ్యాపారవేత్త దొడ్డా ప్రసాద్ తల్లి తులశమ్మ ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రసాద్కు సోదరి కూడా ఉంది. ఆమె గుంటూరులో భర్తతో నివాసముంటోంది. తల్లి మృతి వార్త తెలిసినా కరోనా లాక్డౌన్ కారణంగా అధికారులు అనుమతించకపోవటంతో చివరి చూపునకూ వెళ్లలేకపోయింది. బంధువులు కూడా గ్రామంలో ఉన్న కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ఆమె మృతదేహాన్ని ఆటోలో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు.