52 లక్షల షేర్లు విక్రయించిన లారస్ ల్యాబ్స్ ప్రమోటర్
ABN , First Publish Date - 2021-03-05T06:29:32+05:30 IST
లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపక ప్రమోటర్, సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ చావా.. 52 లక్షల లారస్ ల్యాబ్స్ షేర్ల ను విక్రయించారు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపక ప్రమోటర్, సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ చావా.. 52 లక్షల లారస్ ల్యాబ్స్ షేర్ల ను విక్రయించారు. సగటున ఒక్కో షేరును రూ. 368.59 విక్రయించినట్లు వెల్లడించింది. ఈ షేర్ల విక్రయం ద్వారా రూ.191.67 కోట్లు లభిస్తుంది. కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన నాగరాణి చావా కూడా సగటున ఒక్కో షేరు రూ.366.91 ధరకు 18 లక్షల షేర్లను విక్రయించారు. ఈ షేర్ల మొత్తం విలువ రూ.66.04 కోట్లు. ఇద్దరు విక్రయించిన షేర్లు కంపెనీ చెల్లించిన మూలధనంలో 1.3 శాతం. ఈ నిధులను తాకట్టులో ఉన్న షేర్లను విడిపించుకోవడానికి వినియోగిస్తారు.