జగన్, మంత్రుల మానసిక స్థితిని కోర్టు ప్రశ్నించింది: బీజేపీ నేత
ABN , First Publish Date - 2020-05-26T23:21:46+05:30 IST
సోషల్ మీడియాలో న్యాయస్థానాలను కించపరచడం తగదు..ఎంపీగా ఉన్న నందిగం సురేష్ కోర్టులపై ఇలా మాట్లాడడం సరికాదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.
అమరావతి: సోషల్ మీడియాలో న్యాయస్థానాలను కించపరచడం తగదు..ఎంపీగా ఉన్న నందిగం సురేష్ కోర్టులపై ఇలా మాట్లాడడం సరికాదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. శాసనసభ, న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలకు గౌరవం లేదన్నారు. సీఎం జగన్, మంత్రుల మానసిక స్థితిని కోర్టు ప్రశ్నించిందని పేర్కొన్నారు. తప్పును సమీక్షించుకోకుండా న్యాయవ్యవస్థలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేసినట్లు కోర్టులపై చేస్తే కుదరదన్నారు.