All England Open 2022: సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
ABN , First Publish Date - 2022-03-19T01:01:34+05:30 IST
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2022లో దూకుడుమీదున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్కు..
బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2022లో దూకుడుమీదున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్కు దూసుకెళ్లాడు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన లు గ్వాంగ్ జును ఓడించి సెమీస్ చేరాడు. డిఫెండింగ్ చాంపియన్, మలేషియాకు చెందిన లీ జి జియా- జపాన్కు చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ కెంటో మొమోటా మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో లక్ష్య సేన్ శనివారం సెమీస్లో తలపడతాడు.
పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ వంటి టాప్ షట్లర్లు రౌండ్ 16 నుంచే వెనుదిరగడంతో 20 ఏళ్ల లక్ష్యసేన్ ఇప్పుడు భారత ఆశాదీపంగా మారాడు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకున్న లక్ష్యసేన్ గత ఆరు నెలలుగా మంచి ఊపుమీదున్నాడు.
గతవారం జరిగిన జర్మన్ ఓపెన్లో ప్రపంచ నంబర్ వన్ విక్టర్ అక్సెల్సెన్కు షాకిచ్చి రన్నరప్గా నిలిచాడు. ఈ ఏడాది మొదట్లో ఇండియా ఓపెన్లతో తన తొలి సూపర్ 500 టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.