తెలుగు, సంస్కృత భాషను విడదీయలేం: Lakshmi parvathi

ABN , First Publish Date - 2021-07-15T00:43:27+05:30 IST

తెలుగు, సంస్కృత భాషను విడదీయలేం: Lakshmi parvathi

తెలుగు, సంస్కృత భాషను విడదీయలేం: Lakshmi parvathi


అమరావతి: తెలుగు, సంస్కృత భాషను విడదీయలేమని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి అన్నారు. సంస్కృతంతో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలుగు-సంస్కృత అకాడమీపై నేతలు ఉత్తరాలు మీద ఉత్తరాలు రాస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దీనిని రాజకీయం చేయొద్దని సూచించారు. తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పాలన్నారు. తెలుగు భాషపై చంద్రబాబు, లోకేష్‌కు అసలు అవగాహన ఉందా? అని ఆమె ప్రశ్నించారు. తెలుగు అకాడమీ కోసం ఎంతగానో న్యాయ పోరాటం చేశామని గుర్తుచేశారు. పీవీ నరసింహారావు రూపొందించిన బైలా ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. 

Updated Date - 2021-07-15T00:43:27+05:30 IST