మోదీ ఇచ్చే లక్ష కోట్లు సంపన్నులకే!: నారాయణ

ABN , First Publish Date - 2020-08-11T09:17:34+05:30 IST

మోదీ ఇచ్చే లక్ష కోట్లు సంపన్నులకే!: నారాయణ

మోదీ ఇచ్చే లక్ష కోట్లు సంపన్నులకే!: నారాయణ

హుస్నాబాద్‌, ఆగస్టు 10: ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ప్రకటించిన లక్ష కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లోని సంపన్న వర్గాల కోసమే తప్ప చిన్నకారు రైతాంగానికి ఉపయోగంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో  సోమవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 6.50 లక్షల గ్రామాలలోని ఎంతమంది రైతులకు ఈ డబ్బులు ఉపయోగపడుతాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో అంబానీ ఆస్తి కరోనాలో కూడ మూడో స్థానానికి చేరుకుందన్నారు. రామాలయ నిర్మాణానికి గాడ్సే ముఠాతో శంకుస్థాపన చేయించారని ఆర్‌ఎ్‌సఎ్‌సను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-11T09:17:34+05:30 IST