ప్రమోషన్‌ ఇవ్వకుంటే ఎలా.. కళ్లకు గంతలతో ఉద్యోగిని నిరసన!

ABN , First Publish Date - 2021-10-19T12:21:55+05:30 IST

నాకు మాత్రమే ప్రమోషన్‌ ఇవ్వడం లేదు. ఈ విషయంలో...

ప్రమోషన్‌ ఇవ్వకుంటే ఎలా.. కళ్లకు గంతలతో ఉద్యోగిని నిరసన!

చిత్తూరు జిల్లా/ఐరాల(కాణిపాకం) : ‘నాకు మాత్రమే ప్రమోషన్‌ ఇవ్వడం లేదు. ఈ విషయంలో ఈవో తీరు సరిగా లేదుఅని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆరంజ్యోతి శంకరమ్మ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని ఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తనకు మూడేళ్ల కిందటే ప్రమోషన్‌ రావాల్సి ఉందన్నారు. దీనిపై ఈవోకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు. ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.


నిబంధనల మేరకే పదోన్నతులు: ఈవో

నిబంధనల మేరకే పదోన్నతులు ఇస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు స్పష్టం చేశారు. రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శంకరమ్మ ఆలయ ప్రతిష ్ఠకు భంగం కలిగేలా ఆందోళన చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అ యినా మానవతా దృక్పథంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఉద్యోగుల అర్హతలను అనుసరించి పదోన్నతులు ఉంటాయన్నారు. 

Updated Date - 2021-10-19T12:21:55+05:30 IST