అడవిదున్న దాడిలో మహిళ మృతి
ABN , First Publish Date - 2022-08-20T16:18:09+05:30 IST
అడవిదున్న దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందింది. సేలం జిల్లా ఏర్కాడు పట్టిపాట్టి గ్రామానికి చెందిన శేఖర్ భార్య దేవి (37)
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 19: అడవిదున్న దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందింది. సేలం జిల్లా ఏర్కాడు పట్టిపాట్టి గ్రామానికి చెందిన శేఖర్ భార్య దేవి (37) గురువారం సాయంత్రం ఏర్కాడు టౌన్కు వచ్చి మోపెడ్పై స్వగ్రామానికి బయల్దేరింది. నడువూర్ గ్రామంలో సమీపంలో వస్తుండగా హఠాత్తుగా రోడ్డు పక్కనే ఉన్న పొదల నుంచి ఓ అడవి దున్న ఆమెపై దాడిచేసింది. గాయపడిన ఆమెను ఏర్కాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతిచెందింది.