కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనపై డీజీపీ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-01-09T03:34:58+05:30 IST
ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని..
విజయవాడ: ప్రశాంతమైన కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆత్మకూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ఆత్మకూరు సంఘటన ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు.