కర్నూలులో 40 డిగ్రీలు

ABN , First Publish Date - 2020-03-29T08:02:19+05:30 IST

కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో...

కర్నూలులో 40 డిగ్రీలు

 విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కాగా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 40 డిగ్రీలు నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత మరింత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2020-03-29T08:02:19+05:30 IST