కర్నూలు మున్సిపల్ సిబ్బంది నిర్వాకం

ABN , First Publish Date - 2022-03-16T23:31:47+05:30 IST

కర్నూలు మున్సిపల్ సిబ్బంది చేసిన నిర్వాకంపై విమర్శలు

కర్నూలు మున్సిపల్ సిబ్బంది నిర్వాకం

కర్నూలు: కర్నూలు మున్సిపల్ సిబ్బంది చేసిన నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త పన్ను కట్టలేదని దుకాణాల ముందు సిబ్బంది చెత్త వేశారు. నెహ్రూ రోడ్‌లోని అనంత కాంప్లెక్స్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కో దుకాణం నుంచి రూ.200 చెల్లించాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సిబ్బందిపై దుకాణాల నిర్వాహకులు మండిపడుతున్నారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-03-16T23:31:47+05:30 IST