మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్‌

ABN , First Publish Date - 2022-04-13T12:08:14+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు జరగలేదు. పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల

మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో పూజలు బంద్‌

కర్నూల్: మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఏకాదశి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు జరగలేదు. పీఠాధిపతి సుబుధీంద్రతీర్థుల ఆధ్వర్యంలో సుప్రభాతం, నిర్మల విసర్జనం చేసి నిజ బృందావనానికి మహామంగళహారతులిచ్చారు. ప్రతిరోజు జరగాల్సిన నిత్య పూజలు, అలంకరణ, టెంకాయలు కొట్టడం, పరిమళ ప్రసాదం, రథోత్సవాల ఊరేగింపు, నిత్యాన్నదానం వంటివి బంద్‌ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రాఘవేంద్రస్వామి అలంకరణలేని నిజ బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పీఠాధిపతులతోపాటు పండితులు, అర్చకులు ఉపవాసాలు పాటించారు.

Updated Date - 2022-04-13T12:08:14+05:30 IST