ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కుంభా రవిబాబు

ABN , First Publish Date - 2021-03-05T09:16:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ జాతుల కమిషన్‌ చైర్మన్‌గా అరకు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును నియమిస్తూ ప్రభుత్వం

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కుంభా రవిబాబు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ జాతుల కమిషన్‌ చైర్మన్‌గా అరకు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన పదవీ కాలం మూడేళ్లుగా గురువారం గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, గతంలో ఉండే ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కమిషన్‌, ఎస్టీ కమిషన్‌ అని రెండుగా విడదీస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. ఈ చట్టం గత ఏడాది డిసెంబరు 25 నుంచి అమల్లోకి తెచ్చింది. ఇకపై ఎస్టీలకు సంబంధించిన సమస్యలను ఎస్టీ కమిషన్‌ ద్వారా పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించారు. 

Updated Date - 2021-03-05T09:16:18+05:30 IST