కేయూ వీసీగా రమేశ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-05-24T05:18:21+05:30 IST

కేయూ వీసీగా రమేశ్‌ బాధ్యతల స్వీకరణ

కేయూ వీసీగా రమేశ్‌ బాధ్యతల స్వీకరణ
వీసీగా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రొఫెసర్‌ రమేశ్‌

కేయూ క్యాంపస్‌, మే 23 : కాకతీయ యూనివర్సిటీ 14వ వైస్‌చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ ఆదివారం ఉదయం కేయూ పరిపాలన భవనంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన వీసీ ప్రొఫెసర్‌ రమేశ్‌ మాట్లాడుతూ.. అందరి సహకారంతో వర్సిటీ ప్రతిష్ఠ పెంచే విధంగా పనిచేస్తానన్నారు. బోధన, పరిశోధనతో పాటు అభివృద్దికి పాటుపడుతానన్నారు. అందరం ఒక కుటుంబంగా పనిచేద్దామని కోరారు. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులను చేరేందుకు ఆన్‌లైన్‌పై దృష్టి సారిస్తామని తెలిపారు. కాగా, వీసీగా బాధ్యతలు చేపట్టిన రమేష్‌కు కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్‌ ఎం.రాజేశ్వర్‌, ప్రొఫెసర్‌ తాళ్ళపల్లి మనోహర్‌, ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డి, డాక్టర్‌ ఎం.నాగేంద్రబాబు, వి.రాజిరెడ్డిలు శాలువాతో సత్కరించారు.

Updated Date - 2021-05-24T05:18:21+05:30 IST