నేడు సంగారెడ్డిలో కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2022-03-08T13:23:51+05:30 IST
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సంగారెడ్డిలో పర్యటించనున్నారు.
సంగారెడ్డి: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఉదయం 9: 30 గంటలకు పటాన్ చెరు మండలం సుల్తాన్ పూర్ లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడతారు. ఆ తర్వాత మంత్రి ఉదయం 11 గంటలకు పటాన్ చెరులో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.